అందరూ బరువు తగ్గాలని తిండి తగ్గించి నీరసపడి పోతారు తప్ప బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే చెత్త తిండిని పూర్తిగా మాని మంచి తిండిని పెంచితే బరువు తగ్గి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చిట్కాలు:
  1. బరువున్న వారికి రక్తం తక్కువగా ఉంటుంది. పచ్చికూరల రసాన్ని గ్లాసుడు త్రాగితే బరువు పెరగకుండా రక్తం పడుతుంది.
  2. ఉదయం టిఫిన్ క్రింద ఇడ్లీ, దోసెలను 1, 2 తినడం మాని మొలకెత్తిన విత్తనాలను బాగా ఎక్కువగా పెట్టుకుని తింటే పోషకాహార లోపాలు పోతాయి. నీరసం కూడా తగ్గుతుంది. కొబ్బరి, వేరుశనగ పప్పులు లేకుండా మిగతా గింజలు తినవచ్చు.
  3. మధ్యాహ్నం భోజనంతో అన్నాన్ని పూర్తిగా మాని రొట్టెలను 3, 4 పెట్టుకుని అందులో కూరలను (ఉప్పు, నూనె లేకుండా చప్పగా) బాగా ఎక్కువగా పెట్టుకుని తినాలి. ఎంత కూర తింటే అంత క్రొవ్వు కరుగుతుంది. కూరలలో పీచు పదార్థాలు ఉండడం వల్ల బరువు పెరగకుండా క్రొవ్వు కరుగుతుంది. రొట్టె తిన్నాక కొంచెం పెరుగు తినవచ్చు. ఇక అన్నం వద్దు. సాయంకాలం 5 గంటలకు ఒక గ్లాసుడు పండ్ల రసం త్రాగితే మంచి రక్తం పడుతుంది. ఆరోగ్యానికి మంచిది. పండ్ల వల్ల బరువు పెరగరు.
  4. సాయంకాలం 6-6.30 గంటలకల్లా భోజనం ముగించాలి. ప్రొద్దుపోయి తింటే తిన్నది క్రొవ్వుగా మారుతుంది. పెందలకడనే తింటే నిల్వ ఉన్న క్రొవ్వు కరుగుతుంది.
  5. భోజనంలో 2, 3 రొట్టెలు ఎక్కువ కూరతో పెట్టుకుని సరిపెట్టాలి. పెరుగు వద్దు. అన్నం వద్దు.
  6. బరువు తగ్గడానికి రోజూ ఆసనాలు వేస్తే ఏ భాగంలో ఎక్కువ క్రొవ్వు పేరుకుంటే ఆ భాగంలో క్రొవ్వు కరగడానికి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయి.
  7. బరువు తగ్గడానికి ఆయా ఆసనాలు వేస్తే నెలకు 5, 6 కేజీలు తగ్గుతారు. ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.

Post a Comment

0 Comments