స్త్రీలలో నీరు తక్కువగా త్రాగడం వల్ల ఎక్కువగా వస్తుంది. చిక్కటి మూత్రం, పచ్చటి మూత్రం ఎక్కువ గంటలు ఆపి పొయ్యడం వల్ల, ఆ మూత్రం గాఢతకు మండుతుంది. ఎప్పుడూ మూత్రం మీ కంటికి తెల్లగా కనబడాలి. ఎప్పుడు పోసినా ధారగా రావాలి. ఎప్పుడూ మూత్రం చిక్కగా ఉండకూడదు. కంపు రాకూడదు.
చిట్కాలు:
  1. ప్రతి రోజూ నీటిని 4, 5 లీటర్లు త్రాగితే 2, 3 రోజులలో మూత్రంలో మంట తగ్గుతుంది.
  2. పగటి సమయంలో కూడా నీటిని టైము ప్రకారం త్రాగాల్సిందే. ఎండలో తిరిగేవారు ఇంకాస్త ఎక్కువ త్రాగుతూ ఉంటే మంట రాకుండా ఉంటుంది.
  3. మంట తగ్గడానికి పంచదార నీళ్ళుగాని, ఇతర పానీయాలు వృధా.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.