కొంతమందికి పుండ్లు పడినా, తెగినా, గాయమైనా త్వరగా మానదు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలోనూ, విటమిన్ 'సి' తక్కువగా ఉన్నవారిలోను త్వరగా మానే గుణం తక్కువగా ఉంటుంది.
చిట్కాలు:
  1. పుల్లటి పండ్ల రసాలను తేనె వేసుకుని త్రాగితే మంచిది.
  2. నిమ్మరసాన్ని అన్నం తినేటప్పుడు 1, 2 కాయల రసాన్ని కొద్దికొద్దిగా పిండుకుని తింటే మంచిది. ఇలా రెండు పూటలా చేయవచ్చు. ఎప్పటికీ ఇది మానాల్సిన పని లేదు.
  3. జామకాయలు చౌకగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజూ 1, 2 కాయలను ముందు నుండి అందరూ తింటూ ఉంటే ఎంతో మంచిది. నమలలేని వారు జామపండ్లను తినవచ్చు.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.