ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనావైరస్ ఎక్కువకాలం మనుగడ సాగిస్తున్నట్లు కొన్ని పరిశోధనలు సూచిస్తుండటంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వంటివాటి వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హీటింగ్‌ రిఫ్రిజిరేటింగ్‌ అండ్‌ కండిషనర్‌ ఇంజినీర్స్‌(ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ) సూచనల మేరకు కేంద్ర ప్రజాపనుల శాఖ(సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలను విడుదల చేసింది.

వీటి ప్రకారం... గదిలో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీ (సెంటీగ్రేడ్)ల మధ్య ఉండేలా జాగ్రత్త పడాలి. గాలిలో తేమ స్థాయి 40-70 డిగ్రీల మధ్య ఉండాలి.

ఏసీలు పనిచేస్తున్నా.. బయటి నుంచి గాలి వచ్చేలా, ఇంట్లోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను కొద్దిగా తెరిచి పెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి.

స్ప్లిట్‌ ఏసీ ఫిల్టర్లను.. కార్యాలయాల్లోని సెంట్రలైజ్డ్‌ ఏసీల డక్ట్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.

కమర్షియల్‌ ప్రాంతాల్లో.. 70-80 శాతం బయటి గాలి లోనికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్‌ కూలర్లు వాడుతున్నవారు, అవి బయటి గాలిని పీల్చేలా జాగ్రత్తపడాలి. కూలర్‌ను గది తలుపు లేదా, కిటికీ దగ్గరపెట్టాలి.

కూలర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి.

కూలర్లను వినియోగిస్తున్నా.. తేమ బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచే పెట్టాలి. బయటి గాలిని పీల్చుకోలేని పోర్టబుల్‌ కూలర్లను వాడకూడదు.

ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగానైనా తెరిచి ఉంచాలి. ఫ్యాన్‌ వాడే గదిలో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఉంటే, వెంటిలేషన్‌ కోసం దాన్ని ఆన్‌ చేసి పెట్టడం మంచిది.

ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.