చలికాలంలో అందరి చర్మం తెల్లగా, పౌడర్ ఎక్కువ రాసుకున్నట్లుగా ఉంటే కోల్డ్ క్రీములు వ్రాస్తుంటారు. చర్మం చలికాలంలో అలా కాకుండా, పగలకుండా ఉండాలంటే సబ్బులు మానాలి. చలికాలంలో అసలే చర్మం పొడిగా ఉంటుంది. సబ్బు పెట్టడం వల్ల ఇంకా పొడిగా, బిరుసుగా అవుతుంది. సబ్బులలో ఉండే కెమికల్స్, చర్మం పై పొరను పాడు చేస్తాయి. క్రొత్త పొర పుట్టకుండా పాత పొర పాడయ్యేసరికి చర్మం తెలుపుగా, పగిలి అలా తయారవుతుంది.
చిట్కాలు:
సబ్బులు పుర్తిగా మానాలి. స్నానం చేసే ముందు కొంచెం కొబ్బరి నూనెను శరీరమంతా రాసుకుని ఒళ్ళు రుద్దుకోవడానికి మెత్తటి టవలు తీసుకుని బాత్ రూమ్ కు వెళ్ళండి. శరీరాన్ని నీటితో తడిపాక, ఆ టవలును తడిపి పిండి, అప్పుడు దానితో శరీరాన్నంతా రుద్దుకోండి. మీ మురికంతా చర్మం దెబ్బతినకుండా ఆ టవలకు అవుతుంది. రుద్దడం అయ్యాక మరలా నీరు పోసుకుని పొడి టవలుతో తుడుచుకుంటే సరిపోతుంది. ఈ రకం స్నానం ప్రతిరోజూ చేస్తే చర్మం పూర్తిగా శుభ్రంగా ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.

0 Comments